telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

లక్ష కోట్లు దాటిన … జన్‌ ధన్ డిపాజిట్లు …

one lak crore jan dhan deposits

ఆర్థిక మంత్రిత్వ శాఖ జన్‌ ధన్ బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్లు రూ.లక్ష కోట్లు దాటాయని తెలిపింది. ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేసిన ఆర్థిక శాఖ.. జూలై 3 నాటికి 36కోట్ల లక్షలకు పైగా ప్రధానమంత్రి జన్‌ ధన్ యోజన ఖాతాల్లో రూ.లక్ష 400కోట్లు డిపాజిట్లు ఉన్నాయని పేర్కొంది. జన్ ధన్ ఖాతాల్లో లబ్ధిదారుల డిపాజిట్లు క్రమంగా పెరుగుతున్నాయని తెలిపింది.

జూన్ 6 నాటికి రూ.99వేల 600 కోట్ల డిపాజిట్లు ఉండగా.. జూలై 3 నాటికి లక్ష 400 కోట్ల రూపాయలకు చేరుకున్నాయని వెల్లడించింది. కాగా దేశ ప్రజలందరికీ బ్యాంకింగ్ సదుపాయం కల్పించాలనే ఉద్దేశ్యంతో ప్రధాని నరేంద్ర మోదీ 2014లో జన్‌ధన్ పథకాన్ని ప్రారంభించారు. ఇందులో 50 శాతానికిపైగా మహిళలు ఉన్నారు.

Related posts