telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు విద్యా వార్తలు సామాజిక

ఏపీలో ఒకేరోజు రెండు పరీక్షలు.. అయోమయంలో అభ్యర్థులు!

Inter Ist Year Chemistry paper leake

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగ నియమాల కోసం నిర్వహించే పోటీ పరీక్షలకు తేదీలను ఖరారు చేసింది. అయితే ఒకే రోజు రెండు పరరీక్షలుండడంతో అభ్యర్థులు అయోమయానికి గురవ్తున్నారు. వచ్చే నెల 5న గ్రూప్-2 ప్రిలిమినరీ పరీక్ష జరగనుండగా అదే రోజున ఎల్ఐసీ ఏఏఓ పరీక్షలు జరగనున్నాయి. గ్రూప్-2 పరీక్షకు ఇప్పటికే 3 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో చాలామంది ఏఏవో పరీక్షకు కూడా దరఖాస్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఏ పరీక్షకు హాజరుకావాలో అర్థం కాక అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు.

అయితే గ్రూప్-2 పరీక్షలు వాయిదా వేయాల్సిందిగా తాము పలుమార్లు కోరినా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) పట్టించుకోలేదని కొందరు నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో కేంద్ర ప్రభుత్వ నియామక పరీక్షలు జరిగినప్పుడు రాష్ట్ర స్థాయి పరీక్షలను వాయిదా వేసేవారని , కానీ ఏపీపీఎస్సీ ఆ సంప్రదాయాన్ని ప్రస్తుతం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా గ్రూప్-2 పరీక్షను వాయిదా వేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు.

Related posts