తెలంగాణ ప్రభుత్వం అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా వేర్వేరు రంగాల్లో విశేష సేవలందించిన మహిళలకు పురస్కారాలను ప్రకటించింది. మొత్తం 14 విభాగాల్లో 21 మందిని ఈ పురస్కారాలకు ఎంపిక చేస్తూ మహిళా శిశు సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి ఎం.జగదీశ్వర్ ఉత్తర్వులు విడుదల చేశారు.
ఆ పురస్కారాలు అందుకున్న మహిళారత్నలు వీరే :
సాహిత్యం: డాక్టర్ ప్రేమలత, తస్నీమ్ జోహెర్
నృత్యం: డాక్టర్ కె.రత్నశ్రీ
సంగీతం: సుత్రానే కీర్తిరాణి
జానపద కళలు: శివమ్మ, మోతం జంగమ్మ
చిత్రలేఖనం: ఆచార్య గీత
హరికథ: పద్మాలయ ఆచార్య
పారిశ్రామికం: జ్యోతి వలబోజు
క్రీడలు: మిథాలీ రాజ్
రక్షణ సేవలు: బొడ్డపాటి ఐశ్వర్య
సాహసాలు: జై భారతీ
ఆడియో ఇంజినీరింగ్: సాజిదా ఖాన్
సామాజిక సేవలు: కమ్మరి సరస్వతి, బెల్లం మాధవి, అప్కా మల్లురమ, కడప తుకాబాయి, డాక్టర్ అమ్మ శ్రీదేవి
పాత్రికేయం: యశోదారాణి
రచన ముడుంబై
సామాజిక గానం: సుద్దాల భారతీ