అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఎస్బీఐ బ్యాంక్ ఓ శుభవార్త చెప్పింది. సొంతింటి కలను నిజం చేసుకోవాలనుకునే మహిళలకు ఈ తీపి కబురును అందించింది. గృహరుణాలపై ప్రత్యేక తగ్గింపు వడ్డీరేటును మహిళలకు అందించనుంది. హోం లోన్ల వడ్డీ రేటును అదనంగా 5 బేసిస్ పాయింట్లు తగ్గించనున్నట్లు సోమవారం ప్రకటించింది ఎస్ బీఐ బ్యాంకు. తాజా సవరణ ద్వారా 6.70 శాతం వద్ద ప్రారంభ వడ్డీ రేట్లతో హొం లోన్స్ ప్రత్యేకంగా మహిళలకు అందుబాటులో తీసుకొస్తున్నట్లు తెలిపింది. మహిళల దినోత్సవం సందర్భంగా అందిస్తున్న ఈ అవకాశాన్ని మహిళలు వినియోగించుకోవాలని కోరింది. మీ కలల సౌథం.. మా లక్ష్యం అంటూ ఎస్బీఐ ట్వీట్ చేసింది. అలాగే యోనో యాప్ ద్వారా జరిపే బంగారం, డైమండ్ ఆభరణాల కొనుగోళ్లపై స్పెషల్ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. 30 శాతం దాకా తగ్గింపును ఆఫర్ చేస్తున్నట్లు తెలిపింది.
previous post