telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్

వారసుడి కోసం అంటూ .. 55ఏళ్ళ వయసులో వివాహం..! కేసు పెట్టిన కుమార్తెలు..

పుత్రుడు ఉంటె పున్నమనరకం నుండి తప్పిస్తాడని ఎంత నమ్మకం ఉంటె మాత్రం ఇంత పిచ్చి పనా.. ఇద్దరు పెళ్లీడుకొచ్చిన పిల్లలు ఉన్నప్పటికీ ఓ తండ్రి అడ్డదారులు తొక్కాడు. తనకు వారసుడు కావాలంటూ మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. కుటుంబాన్ని వదిలేసి యువతితో మరో కాపురం పెట్టాడు. ఈ విషయమై కుమార్తెలు ఆందోళనకు దిగడంతో గ్రామస్తులు వీరికి మద్దతు పలికారు. బెళగావి తాలూకాలోని కాకతి గ్రామానికి చెందిన బాళెగౌడ పాటిల్‌ (55)కు పాతికేళ్ల క్రితం మహదేవి అనే మహిళతో వివాహమైంది. వీరికి ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. అయితే కొన్నేళ్ల క్రితం అనారోగ్యంతో కుమారుడు చనిపోయాడు.

ఇటీవల పెద్ద కుమార్తెకు పెళ్లి చేసి పంపారు. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ.. తనకు వారసుడు కావాలని పట్టుబట్టాడు. అక్కడితో ఆగకుండా ఓ యువతిని పెళ్లి చేసుకుని బెళగావిలో కాపురం పెట్టాడు. కుటుంబం ఆర్థిక కష్టాల్లో చిక్కుకోవడంతో ఇద్దరు కుమార్తెలు తండ్రిని వెతుక్కుంటూ వచ్చారు. అయితే ఇంటిలో ఎవ్వరూ లేకపోవడంతో తమకు న్యాయం చేయాలని కోరుతూ పోలీసులను ఆశ్రయించారు. తమ తండ్రి వ్యవహార శైలిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Related posts