telugu navyamedia
సినిమా వార్తలు

“ఓ బేబీ” సక్సెస్ సెలెబ్రేషన్స్

Oh-Baby

దర్శకురాలు నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో “ఓ బేబీ” అనే సినిమాను తెరకెక్కించారు. “ఎంత సక్కగున్నావే” అనేది ట్యాగ్ లైన్. “మిస్ గ్రానీ” అనే కొరియన్ సినిమాను నందిని రెడ్డి రీమేక్ చేశారు. మిక్కి జె.మేయ‌ర్ సంగీతం అందించిన ఈ చిత్రానికి రిచ‌ర్డ్ ప్ర‌సాద్ సినిమాటోగ్ర‌ఫీ అందించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, సురేశ్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ లక్ష్మి ఈ సినిమాలో కీలకమైన పాత్రలో నటించారు. ఊర్వశి, రాజేంద్రప్రసాద్, రావు రమేశ్, నాగశౌర్య ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. నిన్న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. సినిమా అంచ‌నాల‌ను అందుకుంటూ ఘ‌న విజ‌యంగా నిలిచింది. ఎమోష‌న‌ల్‌తో పాటు ప‌లు కామెడీ సన్నివేశాల‌తో రూపొందిన ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అలరిస్తుంది. ఈ సినిమాలో సమంత నటనకు సినీ అభిమానులే కాక సెల‌బ్రిటీలు కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల‌లోనే కాక విదేశాల‌లోను ఈ చిత్రానికి మంచి వ‌సూళ్ళు వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలో ఓబేబి స‌క్సెస్ సెల‌బ్రేష‌న్స్‌ని రామానాయుడు స్టూడియోలో జ‌రిపారు. రామానాయుడు స్టూడియో ముందు ప‌టాకులు పేల్చి తీన్‌మార్ ఆడారు. ఆ త‌ర్వాత స‌మంతతో కేక్ క‌ట్ చేయించారు. యుఎస్ లో ఈ సినిమా కేవలం ప్రీమియర్‌లో 1,45,135 డాలర్లు రాబట్టిందని ట్రేడ్ విశ్లేషకులు తెలిపారు. ఈ ఏడాది టాలీవుడ్‌లో అత్యధిక వసూళ్లు(ప్రీమియర్‌) సాధించిన ఆరో చిత్రంగా ఓ బేబి నిలిచిందని పేర్కొన్నారు.

Related posts