telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ

ఏపీకి క్యూ కడుతున్న… తెలంగాణ అధికారులు..

officers applied on deputation to AP

ఏపీలో జగన్ అధికారం చేజిక్కించుకున్నాడు. దీనితో ఒకప్పటి అధికారులు మళ్ళీ ఏపీకి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే చాలా మంది డిప్యూటేషన్ పై ఏపీకి వెళ్లాలని తెలంగాణ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిన ఓబులాపురం గనుల లీజు వ్యవహారంలో చిక్కుకుని జైలుకు వెళ్లొచ్చిన ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి ఇప్పుడు ఏపీకి వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు.

ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వరంగ సంస్థల ముఖ్య కార్యదర్శిగా ఉన్న శ్రీలక్ష్మి డిప్యుటేషన్‌పై ఏపీకి వెళ్లేందుకు దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్ర విభజన సమయంలో శ్రీలక్ష్మిని తెలంగాణకు కేటాయించారు. ఇప్పుడు ఏపీలో జగన్ అధికారంలోకి రావడంతో ఆమె ఏపీ వెళ్లాలని నిర్ణయించుకున్నారు. దీంతో ప్రభుత్వానికి ఆమె దరఖాస్తు చేసుకున్నారు. శ్రీలక్ష్మితోపాటు మరికొందరు అధికారులు కూడా డిప్యుటేషన్‌పై ఏపీకి వెళ్లేందుకు ఆసక్తిగా ఉన్నట్టు తెలుస్తోంది.

Related posts