ప్రజల్లో అవగాహన కలిగించేందుకు దెయ్యాలు, పిశాచాలు ఉన్నాయంటూ వస్తున్న వార్తలపై స్పందించిన కలెక్టర్.. కొత్తగా నిర్ణయం తీసుకున్నారు. ఆధారాలతో సహా వచ్చేవారికి ఆ బహుమతి ఇస్తామన్నారు. ఒడిశాలోని గంజాం జిల్లా కలెక్టర్ విజయ్ అమృత కులాంగే చేసిన ఈ ప్రకటన ఆ రాష్ట్రంలో చర్చనీయంగా మారింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఎవరైనా దెయ్యాలు, భూతాలు ఉన్నాయని నిరూపిస్తే రూ.50 వేలు రివార్డు ఇస్తాను. స్వయంగా నా జేబు నుంచే ఆ డబ్బులు చెల్లిస్తా అని తెలిపారు. చేతబడులు చేస్తున్నారని, మనుషులకు దెయ్యం పట్టిందనే వివిధ కారణాలతో ప్రజలు.. ఇతరుల ప్రాణాలు తీస్తున్నారు. వారిని దారుణంగా హింసిస్తున్నారు. ఇలాంటి మూఢ విశ్వాసాలను నమ్మవద్దని చెబుతున్నాను. ఇలాంటివి అరికట్టాలనే ఉద్దేశంతోనే ఈ ప్రకటన చేశానని తెలిపారు.
వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు…