telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

ఫణితో .. వణికిపోతున్న .. ఒడిశా..

odisa is most effected by fani cyclone

శ్రీకాకుళంలో ఫణి తుపాను కారణంగా భారీ వర్షపాతం నమోదైంది. వంశధార నదికి భారీ వర్షాల కారణంగా వరదలు వచ్చే ప్రమాదం ఉందని జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రస్తుతానికైతే శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు ముప్పు తప్పింనది అధికారులు వెల్లడించారు.

ఒడిశా మాత్రం అల్లకల్లోలంగా మారింది. ఈదురు గాలులు, కుంభవృష్టి వర్షాలతో జనజీవనం స్తంభించింది. ప్రజలు సహాయక శిబిరాల్లోనే తలదాచుకుంటున్నారు. ఇప్పటికే ఒడిశాలోని రవాణా వ్యవస్థ స్తంభించింది. తాజాగా కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా ధ్వంసమైంది. అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. ముందస్తు హెచ్చరికలతో అన్ని ప్రాంతాలలో అప్రమత్తంగా ఉండటం చేత ఆస్తి నష్టం భారీగా ఉన్నా.. ప్రాణనష్టం మాత్రం ఉండకపోవచ్చని అధికారులు భావిస్తున్నారు.

Related posts