థాయ్ లాండ్ కొత్త పార్లమెంట్ ప్రధానిగా పాలక సైనిక కూటమి నేత జనరల్ ప్రయుత్ ఛాన్ ఓఛాను ఎంపిక చేసింది. బుధవారం ఇక్కడ జరిగిన పార్లమెంట్ ఉభయసభల సమావేశంలో ప్రధానికి ఎన్నికయ్యేందుకు అవసరమైన 375 ఓట్లను ఆయన సాధించారు. పార్లమెంట్ దిగువ సభకు ఇటీవల ఎన్నికలు జరగ్గా, ఎగువ సభను మొత్తం పాలక సైనిక కూటమి నియమించిన విషయం తెలిసిందే.
మార్చి 24న సార్వత్రిక ఎన్నికలు ముగిసిన 10 వారాల తరువాత ప్రధాని ఎన్నిక జరగటం గమనార్హం. సైనిక కూటమి తన పాలనను సుస్థిరం చేసుకునేందుకే సార్వత్రిక ఎన్నికల తంతును నిర్వహించిందని ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించాయి.