telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తండ్రి, కొడుకులు తెలంగాణకు పట్టిన చీడ పురుగులు…

సిఎం కెసిఆర్, కేటీఆర్ లపై బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు NVSS ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ నిందలు మోపుతుందని ఫైర్ అయ్యారు. తండ్రి, కొడుకులకు ఇద్దరికి కరోనా వచ్చింది… కళ్ళు తెరవండి .. రాజకీయాలు సరికాదని చురకలు అంటించారు. వ్యాక్సిన్ ని ఎక్కువగా వేస్ట్ చేసింది తెలంగాణనేనని… ఇప్పటికి సీఎం కేసీఆర్ వ్యాక్సిన్ వేసుకోలేదు.. ఎలాంటి సందేశం సీఎం ప్రజలకు ఇస్తున్నట్టు అని నిప్పులు చెరిగారు. మీకు ఈటలకు పడకపోవచ్చు… భేదాభిప్రాయాలు ఉండొచ్చు.. కానీ తెలంగాణా ప్రజల జీవితాలతో చెలగాటం అడడం సరికాదని హెచ్చరించారు.. తెలంగాణలో ఉన్న యాక్టీవ్ కేసులను దృష్టిలో పెట్టుకొని కేంద్రం రేమిడిసివిర్ ఇంజక్షన్ లను కేటాయించింది.. ఆక్సిజన్, రేమిడిసివిర్ కృత్రిమ కొరతను రాష్ట్ర ప్రభుత్వం సృష్టిస్తోందని మండిపడ్డారు. Drdo సతీష్ రెడ్డి తెలంగాణలో హాస్పిటల్ ఏర్పాటు చేస్తామని చెప్పినా.. ఇప్పటికి ప్రభుత్వం స్పందించలేదు… మోడీ కి పేరు వస్తుందని రాష్ట్రం పట్టించుకోవడం లేదన్నారు. తండ్రి, కొడుకులు తెలంగాణకు పట్టిన చీడ పురుగులు అని సంచలన వ్యాఖ్యలు చేశారు..

Related posts