telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు

నూజివీడులోని ట్రిపుల్ ఐటీ లో .. విద్యార్థిని ఆత్మహత్య..

nuzvid IIIT student suicide

కృష్ణా జిల్లా లోని ట్రిపుల్ ఐటీ కళాశాలలో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. భాగ్యలక్ష్మి గాళ్స్ హాస్టల్ లోని తన రూంలో సీలింగ్ కు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఆమె చున్నీతో ఉరి వేసుకున్నట్టు గుర్తించారు. సీఎస్సీ థర్డ్ ఇయర్ చదువుతున్న భాగ్యలక్ష్మి గాళ్స్ హాస్టల్ లోని మూడో అంతస్తులో ఇతర విద్యార్థినులతో ఉంటోంది. ఆమె స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా గోకవరం.

నేటి సాయంత్రం ఎంతకీ కిందికి రాకపోవడంతో తోటి విద్యార్థినులు, సిబ్బంది వచ్చి చూసేసరికి ఆమె ఉరి వేసుకున్న స్థితిలో కనిపించింది. అప్పటికే ఆమె మృతి చెందినట్టు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా, ఆత్మహత్యకు ముందు భాగ్యలక్ష్మి ఎవరితోనో వీడియో కాల్ మాట్లాడిందని సహ విద్యార్థినులు చెప్పినట్టు తెలిసింది.

Related posts