telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఆ గ్రామ పంచాయతీలో రూ.వెయ్యికే దహన సంస్కారాలు

తెలంగాణలోని కరీంనగర్ మేయర్ రవీందర్‌సింగ్ రూపా యి చెల్లిస్తే అంతిమ యాత్ర నిర్వహిస్తామని ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. రవీందర్‌సింగ్ తీసుకున్న ఈ నిర్ణయం పై దేశ వ్యాప్తంగా ఎందరో ప్రముఖులు ప్రశంసలు గుప్పించారు. ఆయన స్ఫూర్తితో కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ గ్రామ పంచాయతీ పాలకవర్గం వినూత్న నిర్ణయం తీసుకున్నది. రూ.వెయ్యికే దహన సంస్కారాలు కార్యక్రమానికి శ్రీ కారం చుట్టింది.

ఈ మేరకు నుస్తులాపూర్ సర్పంచ్ రావుల రమేశ్ అధ్యక్షతన జరిగిన పాలకమండలి సా ధారణ సమావేశం తీర్మానించింది. సర్పంచ్ రమేశ్ మాట్లాడుతూ ఎవరైన మరణించినప్పుడు అతని సంబంధీకులు రూ. వెయ్యి చెల్లిస్తే పంచాయతీ పాలకవర్గం తరఫున రూ.5వేలు, సర్పంచ్ సొంతంగా రూ.2 వేలు కలిపి దహన సంస్కారాలు నిర్వహించనున్నట్టు తెలిపారు.

Related posts