ఓ ఆర్థోపెడిక్ వైద్యుని పై నర్సు యాసిడ్ దాడికి పాల్పడిన ఘటన తిరుపతి కోర్టులో గురువారం చోటు చేసుకుంది. ఈ క్రమంలో డాక్టర్ ఆదర్శ్రెడ్డి తృటి తప్పించుకోవడంతో ప్రమాదం తప్పింది. నర్సు బురఖా వేసుకుని వచ్చి యాసిడ్ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. దాడికి పాల్పడిన యువతి గతంలో ఆదర్శ్రెడ్డి ఆస్పత్రిలో నర్సుగా పనిచేసినట్లు తెలుస్తోంది.
తన భార్యతో విడాకులు తీసుకునేందుకు డాక్టర్ ఆదర్శ్రెడ్డి తిరుపతి కోర్టుకు వచ్చిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు నర్సును అదుపులోకి తీసుకున్నారు. యాసిడ్ దాడితో కోర్టు ప్రాంగణంలోని వారంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు.