తన నటన, డాన్సులతో అందరినీ ఆకట్టుకుంటున్నాడు ఎన్టీఆర్. అయితే తాజాగా ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమాను జక్కన్న ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా తరువాత వచ్చే పాన్ ఇండియా రేంజ్ ఫాలోయింగ్ను దృష్టిలో పెట్టుకొని ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాన్ని ఎంచుకోవాలి. ఎన్టీఆర్ ఇప్పటికే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్తో తన తరువాతి సినిమాను ఓకే చేశారు. ఈ సినిమాకు ‘అయినను పోయిరావలె హస్తినకు’ అనే పేరును ఖరారు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. త్రివిక్రమ్-ఎన్టీఆర్ కాంబో మూవీ పాన్ ఇండియా రేంజ్లో రూపొందనుంది. అయితే ఇప్పటికే ఎన్టీఆర్ కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్తో ఓ సినిమా చేసేందుకు ఓకే చెప్పిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఇప్పుడు కొత్తగా మరికొందరి దర్శకుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. మహానటి ఫేమ్ దర్శకుడు నాగ్ అశ్విన్తో ఓ సినిమా చేయనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు తాజాగా బాలీవుడ్ స్టార్ దర్శకుడు సంజయ్లీలా భన్సాలీతో సినిమా చేసేందుకు ఎన్టీఆర్ పచ్చ జెండా ఊపినట్లు సమాచారం. పాన్ ఇండియా రేంజ్ సినిమా తరువాత ఎటువంటి సినిమాలు చేయాలని అన్న విషయంలో ఎన్టీఆర్ పక్కా ప్లానింగ్తో ఉన్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి ఈ సినిమా ఎప్పటికి వస్తుంది అనేది.
previous post
next post