telugu navyamedia
సినిమా వార్తలు

ఎన్టీఆర్ కథానాయకుడు : మునిగిన బయ్యర్లకు “మహానాయకుడు”

NTR-Biopic
దివంగత నందమూరి తారకరామారావు జీవిత చరిత్ర ఆధారంగా బాలకృష్ణ ప్రధాన పాత్రలో దర్శకుడు క్రిష్ “ఎన్టీఆర్ బయోపిక్”ని రూపొందించారు. భారీ అంచనాలతో విడుదలకు సిద్ధమైన ఈ చిత్రం ప్రీరిలీజ్ బిజినెస్ డెబ్బై కోట్ల వరకు జరిగిందని తెలుస్తోంది. అయితే సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు మంచి స్పందన వచ్చింది. కానీ కలెక్షన్ల పరంగా మాత్రం సరైన ఫలితాలు రాలేదు.
ఈ చిత్రం ఓపెనింగ్స్ 30 కోట్ల వరకూ అందుకుంటుందని భావించిన చిత్రబృందానికి షాకిస్తూ మొదటి వారంలో రూ.20 కోట్ల వసూళ్లను కూడా రాబట్టలేకపోయింది. దీంతో సినిమాను భారీ రేట్లు పెట్టి కొన్న బయ్యర్లు మునిగిపోయారు. ఈ విషయం దర్శకుడు క్రిష్, బాలకృష్ణల దృష్టికి వెళ్లడంతో… వారు బయ్యర్ల శ్రేయస్సు కోసం ఓ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.
ఎన్టీఆర్ బయోపిక్ రెండో భాగం “కథానాయకుడు” ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎన్టీఆర్ “కథానాయకుడు” సినిమాతో నష్టపోయిన బయ్యర్లకు త్వరలో విడుదల కాబోయే “మహానాయకుడు” సినిమాను ఫ్రీగా ఇవ్వాలని నిర్ణయించుకున్నారని సమాచారం. మరి “మహానాయకుడు” అయినా బయ్యర్లకు లాభాలు తెచ్చిపెడుతుందేమో చూడాలి. 

Related posts