telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కంటెంటే కింగ్… ఎన్టీఆర్ కొత్త రూల్

ntr

యంగ్ టైగర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా అన్న దాని కంటే కంటెంట్‌నే ముఖ్యం అని ఎన్టీఆర్‌ రూల్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కంటెంట్ ఉంటేనే దర్శకులకు ఓకే చెప్పాలని ఆయన భావిస్తున్నారట. ప్రస్తుతం ఎన్టీఆర్‌, రామ్ చరణ్‌లు కలిసి ఆర్ఆర్ఆర్‌లో నటిస్తుండగా.. ఈ మూవీ తరువాత త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించనున్నారు యంగ్ టైగర్. ఆర్ఆర్ఆర్‌ ఎలాగూ పలు భారతీయ భాషల్లో విడుదల కానుంది కాబట్టి.. తరువాత తాను నటించే సినిమాలను పాన్‌ ఇండియాగా విడుదల చేయొచ్చు. కానీ ఆ ఆలోచనలు ఎన్టీఆర్‌కు లేవట. కేవలం తెలుగులోనే ఈ సినిమాను విడుదల చేయాలని ఆయన అనుకుంటున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే కేజీఎఫ్‌ ఫేమ్ ప్రశాంత్ నీల్, తమిళ దర్శకుడు అట్లీ.. ఎన్టీఆర్‌తో పాన్‌ ఇండియా సినిమాలు తీయాలన్న ఆలోచనలో ఉన్నారు. ఇక రెబల్ స్టార్ ప్రభాస్ పాన్‌ ఇండియా హీరోగా పేరు సంపాదించుకోగా.. ఇప్పుడు అల్లు అర్జున్, విజయ్‌ దేవరకొండలు కూడా అదే బాటలో ఉన్నారు.

Related posts