మణిపూర్కూ ఇన్నర్ లైన్ పర్మిట్ (ఐఎల్పీ)ను వర్తింపజేస్తూ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. పౌరసత్వ చట్ట సవరణలను ఐఎల్పీ పరిధిలోని రాష్ట్రాలకు వర్తింపజేయబోమని కేంద్రం హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మణిపూర్ వాసులు ఈ బిల్లుపై ఆందోళన వ్యక్తంచేశారు. లోక్సభలో ఈ బిల్లుపై చర్చ సందర్భంగా మణిపూర్ను కూడా ఐఎల్పీ పరిధిలోకి తీసుకొస్తున్నట్లు హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ఈ మేరకు బుధవారం హోంశాఖ నోటిఫికేషన్ వెలువరించగా.. రాష్ట్రపతి ఉత్తర్వులు వెలువరించారు.
ఐఎల్పీ పరిధిలో ప్రస్తుతం అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మిజోరాం రాష్ట్రాలు ఉన్నాయి. తాజాగా ఈ జాబితాలో మణిపూర్ కూడా చేరింది. ఐఎల్పీ పరిధిలో ఉన్న రాష్ట్రాల్లో ఇతరులు ఎవరైనా (ఇతర రాష్ట్రాల వారు సైతం) పర్యటించాలంటే అనుమతి తప్పనిసరి. బెంగాల్ తూర్పు సరిహద్దు నిబంధనలు-1873 ప్రకారం ఇన్నర్ లైన్ పర్మిట్ ఆయా రాష్ట్రాలకు వర్తింపజేశారు.
ఎవరికి వారే హీరోలు అనుకుంటే కాంగ్రెస్లో నడవదు: ఎమ్మెల్యే జగ్గారెడ్డి