ఇటీవల కాలంలో తెలుగు సినిమాకు, తెలుగు సినిమా దర్శకులకు దేశవ్యాప్తంగా క్రేజ్ పెరుగుతోంది. “బాహుబలి” సినిమాతో దర్శకధీరుడు రాజమౌళి తెలుగు సినిమా స్టామినాను ప్రపంచానికి పరిచయం చేశారు. ఇక మరో దర్శకుడు తన తొలి బాలీవుడ్ సినిమాతోనే సంచలన విజయాన్ని నమోదు చేశాడు. ఈ ఏడాది బాలీవుడ్లో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాను అందించాడు. అతను మరెవరో కాదు.. “అర్జున్రెడ్డి” దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. “అర్జున్రెడ్డి” రీమేక్గా బాలీవుడ్లో సందీప్ రూపొందించిన చిత్రం “కబీర్ సింగ్”. షాహిద్ కపూర్, కియారా ఆడ్వాణీ హీరో హీరోయిన్లుగా నటించిన ఆ చిత్రం ఈ ఏడాది విడుదలై బ్లాక్బస్టర్ విజయం సాధించింది. దాదాపు 372 కోట్ల రూపాయల వసూళ్లు సాధించి అగ్రస్థానంలో నిలిచింది. ఈ ఏడాది వసూళ్ల విషయంలో ఆ సినిమానే ఇప్పటివరకు టాప్లో ఉంది. సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్, రణ్వీర్ సింగ్ వంటి స్టార్ హీరోల సినిమాలు విడుదలైనప్పటికీ అవేవీ “కబీర్ సింగ్”ను దాటలేకపోయాయి. చాలా రోజులుగా విజయాలు లేకుండా ఉన్న షాహిద్ ఈ సినిమాతో బౌన్స్బ్యాక్ అయ్యాడు. ప్రస్తుతం సందీప్తో పనిచేసేందుకు చాలా మంది బాలీవుడ్ హీరోలు ఆసక్తి చూపిస్తున్నారు. త్వరలో రణ్వీర్ సింగ్ హీరోగా సందీప్ ఓ సినిమాను రూపొందించబోతున్నట్టు తెలుస్తోంది.
previous post
next post