telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

“ఆంధ్రజ్యోతి” ఆఫీస్ అక్రమకట్టడం.. కూల్చివేతకు నోటీసులు!

Andhra Jyothi logo

ఆంధ్రప్రదేశ్ లో నిర్మించిన అక్రమ కట్టడాలపై సీఎం జగన్ దృష్టి సారించారు. ఇప్పటికే రాజధాని ప్రాంతంలో  నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ప్రజావేదికను కూల్చివేసిన ప్రభుత్వం అక్రమ నిర్మాణాల పై ఉక్కుపాదం మోపుతుంది. కరకట్ట ప్రాంతంలోని మిగతా అక్రమ నిర్మాణాలపై కూడా దృష్టి సారించింది. తాజాగా ఈ అక్రమ నిర్మాణాల జాబితాలో ప్రముఖ దినపత్రిక ‘ఆంధ్రజ్యోతి’కి కూడా ఉన్నట్టు తేలింది. తూర్పుగోదావరి జిల్లాలోని పాలచర్ల గ్రామంలో ఆంధ్రజ్యోతి యాజమాన్యం అనుమతులు తీసుకోకుండానే గాల్వాల్యం షీట్ భవనాన్ని నిర్మించారని గోదావరి డెవలప్ మెంట్ అథారిటీ(గుడా) నోటీసులు జారీచేసింది.

ఎలాంటి అనుమతులు లేకుండా 1.75 ఎకరాల విస్తీర్ణంలో రెండంతస్తులతో ఈ ప్రింటింగ్ ప్రెస్ ను నిర్మించారని గుడా తెలిపింది. నోటీసులు అందుకున్న వెంటనే ఈ భవనాన్ని తొలగించాలనీ, లేదంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ మేరకు ఆంధ్రజ్యోతి అధినేత వేమూరి రాధాకృష్ణ కుమార్తె వేమూరి అనూషకు గుడా నోటీసులు జారీచేసింది. ఈ విషయంలో ఏవైనా అభ్యంతరాలు ఉంటే నోటీసులు అందించిన వారం రోజుల్లోగా స్పందించాలని అధికారులు లిఖితపూర్వకంగా తెలిపారు.

Related posts