ఉత్తర కొరియాకు భారత ప్రభుత్వం టీబీ వ్యాధి నిరోధక ఔషధాలను సరఫరా చేయనుంది. ప్రస్తుతం అక్కడ కాశ్య వ్యాధి సంబంధిత ఔషధాల కొరత నెలకొంది. దీంతో ఆ దేశానికి ఔషధాలు పంపి, సాయం చేయాలంటూ భారత్నుడబ్ల్యూహెచ్వో కోరింది. ఆ వినతిపై భారత్ సానుకూలంగా స్పందించింది.
సుమారు మిలియన్ డాలర్ల విలువైన టీబీ మందులను పంపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.ఈ మేరకు భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటన చేస్తూ ఉత్తరకొరియాలోని ప్రజల ఆరోగ్య పరిస్థితులను భారత్ నిశితంగా పరిశీలిస్తోందని తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ చేసిన వినతి మేరకు ఔషధాలను పంపుతామని పేర్కొంది.
రాష్ట్ర ప్రభుత్వ అసమర్ధత వల్లే ఇసుక సమస్య: కన్నా