telugu navyamedia
వార్తలు వ్యాపార వార్తలు సామాజిక

నేటి నుంచి భారత్ లో నోకియా 7.2 ఫోన్ల విక్రయాలు

nokia 8.1 price dropped

ప్రముఖ మొబాయిల్ తయారీ సంస్థ హెచ్‌ఎండీ గ్లోబల్ తన నోకియా 7.2 స్మార్ట్‌ఫోన్‌ను గత వారం భారత్‌లో విడుదల చేసిన విషయం విదితమే. ఈ క్రమంలో ఆ ఫోన్లను ఈ రోజు నుంచి అమ్మకాలు ప్రారంభించారు. ఇప్పటికే ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌తోపాటు నోకియా ఆన్‌లైన్ స్టోర్‌లో వినియోగదారులకు అందుబాటులో ఉంది. ఈ 7.2 స్మార్ట్‌ఫోన్ 4/6 జీబీ ర్యామ్ వేరియెంట్లలో రూ.18,599, రూ.19,599 ధరలకు వినియోగదారులకు లభిస్తాయి.

ఇక ఈ ఫోన్‌లో 6.3 ఇంచుల డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 9.0 పై, 48, 8, 5 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలు, 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ తదితర ఫీచర్లను పొందుపరిచారు. ఇక హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డులను ఉపయోగించి ఈ ఫోన్‌ను కొనుగోలు చేస్తే 10 శాతం క్యాష్‌బ్యాక్ ఇస్తారు. జియో వినియోగదారులు ఈ ఫోన్ కొనుగోలుపై రూ.7200 విలువైన ప్రయోజనాలు పొందవచ్చు. అలాగే నో కాస్ట్ ఈఎంఐ పద్ధతిలోనూ ఈ ఫోన్‌ను కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తున్నారు.

Related posts