ప్రపంచ ప్రఖ్యాత నోబెల్ పురస్కారాలను ఈ ఏడాది ముగ్గురికి ప్రకటించారు. 2019 ఏడాదికి గాను ప్రవాస భారతీయ ఆర్థికవేత్త అభిజిత్ బెనర్జీ నోబెల్ పురస్కారం అందుకోనున్నాడు. ఆయన తన భార్య ఎస్తర్ డఫ్లోతో కలిసి ఈ అవార్డుకు ఎంపికయ్యాడు. వీరిద్దరే కాకుండా మైకేల్ క్రెమెర్ కూడా ఆర్థికశాస్త్రంలో నోబెల్ ప్రైజ్ అందుకోనున్నారు.
ముగ్గురు ప్రతిపాదించిన సిద్దాంతం.. చిన్న చిన్న ప్రశ్నలతో కీలక సమాచారాన్ని సేకరించే విధంగా చేసిందన్నారు. పిల్లల ఆరోగ్య పరిస్థితి మెరుగయ్యేందుకు కావాల్సిన అనేక అంశాలను వారి సిద్ధాంతంలో ప్రతిపాదించినట్లు నోబెల్ కమిటీ చెప్పింది. కెన్యా లాంటి ప్రాంతంలో పాఠశాల ఫలితాల అభివృద్ధిని మెరుగుపరిచిందన్నారు. భారత్ లాంటి దేశంలోనూ ఆర్థిక సూత్రాలు ఎంతో ఉపయుక్తంగా ఉన్నట్లు నిర్ధారణ అయినట్లు కమిటీ తెలిపింది.