telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

లిబియా కు .. భారతీయుల రాకపోకలు నిషేధం.. !

no Indian to stay in libia warned govt

లిబియాలో ఘర్షణ వాతావరణం నెలకొన్న కారణంగా శాంతిభద్రతలు రోజురోజుకూ క్షీణిస్తున్నాయి. ఇక్కడి పరిస్థితులపై యూఎన్ఓ సైతం ఆందోళన వ్యక్తం చేసింది. ఇక్కడ జరుగుతున్న ఘర్షణల్లో ఇప్పటికే దాదాపు 200 మంది మృతి చెందగా, వందలాది మంది గాయపడినట్టు తెలుస్తోంది. దీంతో లిబియాలో నివసిస్తున్న భారతీయులంతా తక్షణమే భారత్‌కు తిరిగి వచ్చేయాలని విదేశాంగశాఖ సూచించింది.

భారతీయులు 500 మందికి పైగా లిబియా రాజధాని ట్రిపోలీలో ఉన్నారని విదేశాంగ శాఖ తెలిపింది. ప్రస్తుతానికి ట్రిపోలి నుంచి విమానాలను నడుపుతున్నామని, ఆ తరువాత భారతీయులను అక్కడి నుంచి తీసుకురావడం కష్టమవుతుందని, కాబట్టి తక్షణమే లిబియాను వీడాలని తెలిపింది.

Related posts