కేరళ లోని శబరిమల అయ్యప్ప దేవాలయం తలుపులు కాసేపట్లో తెరుచుకోనున్నాయి. ఈ రోజు నుంచి డిసెంబర్ 27వ తేదీ వరకు అయ్యప్పకు నిత్యపూజలు జరుగుతాయి. మహిళలను ఆలయ ప్రవేశానికి అనుమతించరాదని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో ఆలయంలోకి ప్రవేశించేందుకు వచ్చిన పది మంది మహిళలను పోలీసులు పంబ నుంచి తిప్పిపంపారు.
శబరిమలలో పది నుంచి 50 సంవత్సరాల లోపు మహిళలు ప్రవేశించవచ్చని, పూజలు నిర్వహించవచ్చని సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఆలయం వద్ద ఎలాంటి ఘర్షణలు చోటుచేసుకోకుండా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. ప్రచారం కోసం మహిళలు ఎవరూ ఆలయానికి రావొద్దని కేరళా మంత్రి విజ్ఞప్తి చేశారు. భక్తుల ఆగ్రహానికి గురైతే ప్రభుత్వానికి సంబంధం లేదని తేల్చి చెప్పారు.
జీఎస్టీతో చిన్న వ్యాపారులు నష్టపోయారు: రాహుల్