telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

కోడిపందేలపై .. కొత్త కన్ను..

no betting and hen fights for sankranthi

సంక్రాంతి పండుగ వస్తూనే గుర్తుకు వచ్చేది కోడి పందేలు. ముందు సరదాగా ప్రారంభమైనప్పటికీ.. రానురాను వ్యసనంగా మారిన ఈ కోడి పందేలను ఆపాలని ఒక వర్గం, సంప్రదాయం అని మరో వర్గం ఎప్పటిలాగానే వాదులాడుకుంటుంది. దీంతో కోడి పందేల జోరు మొదలైంది. కోడి పందేలను ఆపేయాలంటూ కొంతమంది సామాజిక వేత్తలు కోర్టులను ఆశ్రయిస్తున్నా.. తమ ఆచారాన్ని వదిలేదే లేదంటున్నారు నిర్వాహకులు. ఈ క్రమంలో కోడి పందేల ఏర్పాట్లను శరవేగంగా చేసుకుంటున్నారు. అయితే మరోవైపు కోడి పందేలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు పోలీసులు.

చిత్తూరు జిల్లాలో కోడి పందేల స్థావరాలపై వారు దాడులు చేశారు. గంగాధర నెల్లూరు మండలం పెడ కంఠం పల్లి గ్రామ శివారులో కోడిపందేలు నిర్వహిస్తున్న ఐదు మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 10 ద్విచక్ర వాహనాలు, 5760 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. అయితే కొంతమంది పరారీ అవ్వగా.. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. ఇదిలా ఉంటే కోడి పందేల నేపథ్యంలో పుంజులకు గిరాకీ పెరుగుతోంది. రకాన్ని బట్టి ఒక్కో పుంజు రూ.50వేల నుంచి రూ.2లక్షల వరకు పలుకుతోంది.

Related posts