నిఖిల్ హీరోగా టి.ఎన్ సంతోష్ దర్శకత్వంలో “ముద్ర” సినిమా రూపొందింది. ఈ సినిమాలో నిఖిల్ సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తోంది. చాలా రోజుల క్రితమే ఫస్ట్ లుక్ ను విడుదల చేసిన చిత్రబృందం ఈ సినిమాను త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. అయితే తాజాగా “ముద్ర” టైటిల్ ని మార్చి “అర్జున్ సురవరం” అనే టైటిల్ ని ఖరారు చేశారు. ఈ మేరకు కొత్త పోస్టర్ ను కూడా విడుదల చేశారు.
గత కొద్దిరోజులుగా సినిమా టైటిల్ విషయమై నట్టికుమార్, నిఖిల్ ల మధ్య గొడవ జరుగుతోంది. జగపతిబాబు హీరోగా రూపొందిన “ముద్ర” అనే సినిమాను నట్టికుమార్ విడుదల చేశారు. “ముద్ర” పేరుతో సినిమా విడుదల కావడంతో ఇప్పుడు నిఖిల్ సినిమా పేరుని “అర్జున్ సురవరం”గా మార్చేశారు. ఈ సినిమాలో నిఖిల్ జర్నలిస్ట్ గా కనిపించనున్నారు. మార్చి 29న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
#ArjunSuravaram#FreshPoster is here
Coming to Theatres this March 29th.
Plz Do spread the Word 😀🙏 pic.twitter.com/hsUwx5QvJx— Nikhil Siddhartha (@actor_Nikhil) February 4, 2019