telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు వ్యాపార వార్తలు సామాజిక

పీపీఈ కిట్స్ ధరించి బ్యాంక్ లో విధుల నిర్వహణ

PPE Kits Bank

లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో తెలంగాణలో తొల్లిసారిగా పీపీఈ కిట్స్ ధరించి బ్యాంకు ఉద్యోగులు విధులు నిర్వహించారు. నిజామాబాద్ లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) బ్రాంచ్ లో ఉద్యోగులు జాగ్రత్తలు పాటిస్తూ ఈ కిట్స్ ధరించారు. స్థానిక వర్ని చౌరస్తాలో ఉన్న ఎస్బీఐ బ్రాంచ్ ఉద్యోగులు పీపీఈ కిట్స్ ధరించి వినియోగదారులకు సేవలు అందించారు.

ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రెడ్ జోన్ లో ఉన్న బ్రాంచ్ లకు పీపీఈ కిట్స్ అందిస్తున్నారని ఉద్యోగులు తెలిపారు. ప్రతి ఉద్యోగికి రెండు జతల పీపీఈ కిట్స్ ఇచ్చారని వారు తెలిపారు. లాక్ డౌన్ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న డబ్బును తీసుకునేందుకు ప్రజలు పెద్ద ఎత్తున బ్యాంకుకు వస్తున్నారని అన్నారు. కరోనా ముందస్తు చర్యల్లో భాగంగా ఉద్యోగులు అప్రమత్తమయ్యారు.

Related posts