telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఓటిటిలో నితిన్ “రంగ్ దే” ?

Rangde

యంగ్ హీరో నితిన్ ఇటీవల ‘భీష్మ’ సినిమాతో భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. అదే జోష్ లో వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘రంగ్ దే’ సినిమా పట్టాలెక్కించాడు నితిన్. ‘మహానటి’ కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. అయితే ఇప్పుడు నితిన్ నటిస్తున్న’ రంగ్ దే ‘ టీమ్ షాకింగ్ డెసిషన్ తీసుకున్నటు తెలుస్తుంది. తమ సినిమాను ఎట్టి పరిస్థితుల్లో థియేటర్స్ లోనే విడుదల చేస్తామని మొదటి నుంచి “రంగ్ దే” టీమ్ చెప్తూనే వచ్చారు. తాజాగా ఓటీటీలో ఈ సినిమాను విడుదల చేయాలని నిర్మాతలు నిర్ణయించుకున్నారని తెలుస్తుంది. ఇటీవల విడుదలైన టీజర్ కు అనూహ్య సంపందన రావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. ఇప్పటికే అమెజాన్ ప్రైమ్- జీ5 వంటి డిజిటల్ ప్లాట్ ఫామ్స్ నుంచి ఈ చిత్ర బృందానికి భారీ ఆఫర్లు వచ్చినట్టు చెబుతున్నారు. కాగా ఇటీవల నాని నటించిన వి సినిమా కూడా ఓటీటీ వేదికగా విడుదలైంది. అయితే ఈ సినిమా ప్రేక్షకులను అంచనాలను అందుకోలేకపోయింది.

Related posts