telugu navyamedia
సినిమా వార్తలు

ఆ సమయంలో ఏం చేయలేకపోయాను : నితిన్

Nithin

యంగ్ హీరో నితిన్ దాదాపు ఏడాది త‌ర్వాత మ‌ళ్ళీ కెమెరా ముందుకు వచ్చారు. ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం నితిన్, వెంకీ కుడుముల దర్శకత్వంలో “భీష్మా” అనే చిత్రంలో నటిస్తున్నారు. మ‌రోవైపు చంద్రశేఖర్‌ ఏలేటి దర్శకత్వంలో ఓ సినిమా చేయ‌నున్నాడు. వీటితో పాటు తనతో “ఛల్‌ మోహన్‌ రంగ” సినిమాను తెరకెక్కించిన కృష్ణ చైతన్య దర్శకత్వంలోను నితిన్ సినిమా చేయ‌నున్నాడు. సొంత నిర్మాణ సంస్థ శ్రేష్ఠ మూవీ బ్యానర్‌పై నితిన్‌ తండ్రి సుధాకర్‌ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు. 2020 సమ్మర్‌లో ప్రారంభం కానున్న ఈ ప్రాజెక్ట్‌కి “ప‌వర్ పేట” అనే టైటిల్‌ని ఫిక్స్ చేసిన‌ట్టు టాక్. అయితే నితిన్ త‌న భుజానికి గాయ‌మైన స‌మ‌యంలో కొద్ది రోజుల పాటు విశ్రాంతి తీసుకున్నాడు. ఈ క్ర‌మంలో భారీ బ‌రువు పెరిగాడ‌ట‌. బ‌రువు త‌గ్గేందుకు తాను చాలా వ‌ర్క‌వుట్ చేసిన‌ట్టు తెలిపాడు. “కొన్ని నెల‌ల క్రితం నా భుజానికి గాయ‌మైంది. దాని నుండి కోలుకునే లోపే నా చేయి కాలింది. ఇక ఆ స‌మ‌యంలో రెస్ట్ తీసుకోవ‌డం త‌ప్ప చేసేదేముంది. అలా రెస్ట్ తీసుకొని తీసుకొని బ‌రువు పెరిగా. మ‌ళ్లీ వ‌ర్కౌట్స్ పై దృష్టి రెండు నెల‌లో 12 కేజీల బ‌రువు త‌గ్గాను. నా జిమ్‌ ట్రైనర్‌ వంశీకృష్ణకు థ్యాంక్స్” అంటూ నితిన్ ట్వీట్ చేశాడు.

Related posts