యంగ్ హీరో నితిన్ దాదాపు ఏడాది తర్వాత మళ్ళీ కెమెరా ముందుకు వచ్చారు. ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం నితిన్, వెంకీ కుడుముల దర్శకత్వంలో “భీష్మా” అనే చిత్రంలో నటిస్తున్నారు. మరోవైపు చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. వీటితో పాటు తనతో “ఛల్ మోహన్ రంగ” సినిమాను తెరకెక్కించిన కృష్ణ చైతన్య దర్శకత్వంలోను నితిన్ సినిమా చేయనున్నాడు. సొంత నిర్మాణ సంస్థ శ్రేష్ఠ మూవీ బ్యానర్పై నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు. 2020 సమ్మర్లో ప్రారంభం కానున్న ఈ ప్రాజెక్ట్కి “పవర్ పేట” అనే టైటిల్ని ఫిక్స్ చేసినట్టు టాక్. అయితే నితిన్ తన భుజానికి గాయమైన సమయంలో కొద్ది రోజుల పాటు విశ్రాంతి తీసుకున్నాడు. ఈ క్రమంలో భారీ బరువు పెరిగాడట. బరువు తగ్గేందుకు తాను చాలా వర్కవుట్ చేసినట్టు తెలిపాడు. “కొన్ని నెలల క్రితం నా భుజానికి గాయమైంది. దాని నుండి కోలుకునే లోపే నా చేయి కాలింది. ఇక ఆ సమయంలో రెస్ట్ తీసుకోవడం తప్ప చేసేదేముంది. అలా రెస్ట్ తీసుకొని తీసుకొని బరువు పెరిగా. మళ్లీ వర్కౌట్స్ పై దృష్టి రెండు నెలలో 12 కేజీల బరువు తగ్గాను. నా జిమ్ ట్రైనర్ వంశీకృష్ణకు థ్యాంక్స్” అంటూ నితిన్ ట్వీట్ చేశాడు.