సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్పై నితిన్, కీర్తిసురేశ్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం ‘రంగ్ దే`. విజయదశమి రోజున ఈ చిత్రం ప్రారంభమయింది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. నితిన్, కీర్తిసురేష్లపై డైరెక్టర్ త్రివిక్రమ్ గారు క్లాప్ నిచ్చారు. ప్రగతి ప్రింటర్స్ అధినేత పరుచూరి మహేంద్ర కెమెరా స్విచ్ఛాన్ చేశారు. ఈ కార్యక్రమంలో ఇంకా జెమిని కిరణ్,సుధాకర్ రెడ్డి, హర్షిత్ తదితరులు పాల్గొన్నారు.
ప్రేమతో కూడిన కుటుంబ కథాచిత్రమిది. పి.సి.శ్రీరామ్ గారు ఈ చిత్రానికి ఛాయాగ్రహణం అందిస్తుండటం సంతోషంగా ఉంది. అలాగే దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ కూడా కంటిన్యూగా జరుగుతుంది, 2020 వేసవి కానుకగా చిత్రం విడుదల అవుతుందని నిర్మాత సూర్యదేవర నాగవంశీ తెలిపారు.
హృతిక్ చూడు నిన్ను కంగనా ఏం చేస్తుందో… కంగనా సోదరి హెచ్చరిక