ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడైన తర్వాత కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఆరెస్సెస్ నేత భయ్యాజి జోషీతో సమావేశమయ్యారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదలైన మరుసటి రోజే ఈ భేటీ జరగడంతో కొత్త చర్చకు దారి తీసింది. అయితే ఇది మర్యాదపూర్వక భేటీ మాత్రమే అని గడ్కరీ సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. తదుపరి ప్రభుత్వంలో గడ్కరీ పాత్ర గురించి ఇరువురు చర్చించారని, ఆయనకు కీలక పదవి దక్కేలా చూస్తామని ఆరెస్సెస్ నేత హామీ ఇచ్చినట్లు సదరు వర్గాలు తెలిపాయి.
దాదాపు రెండు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో బేజీపీ సీనియర్ నేత కైలాశ్ విజయ్వర్గియా కూడా ఉన్నారు. ప్రభుత్వ పథకాల గురించి తాము చర్చించినట్లు కైలాశ్ మీడియాకు తెలిపారు. ‘పీఎం నరేంద్ర మోదీ’ చిత్రం పోస్టర్ విడుదల సందర్భంగా గడ్కరీ మాట్లాడుతూ, ప్రధాని రేసులో తాను లేనని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. మోదీ నాయకత్వంలోనే తాము ఎన్నికల ప్రచారానికి వెళ్లామని చెప్పారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల అనంతరం జోషితో గడ్కరీ సమావేశం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
బొత్స తానే సీఎంలా మాట్లాడుతున్నారు: పవన్ విమర్శలు