లోక్సభ ఎన్నికలకు సంబంధించి జాతీయ మీడియా వెల్లడించిన ఎగ్జిట్పోల్ ఫలితాలు దేశ వ్యాప్తంగా ఉత్కంఠను రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేథ్యంలో బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి నితిన్ గడ్కరీ ఎగ్జిట్ పోల్స్ పై స్పందించారు. ప్రధాని మోదీ బయోపిక్ ‘పీఎం నరేంద్రమోదీ’ పోస్టర్ ను గడ్కరీ విడుదల చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎగ్జిట్ పోల్స్ ఫైనల్ కాదని స్పష్టం చేశారు. ఎగ్జిట్ పోల్స్ లో ఉన్నది తుది ఫలితాల్లో ప్రతిబింబిస్తుందని తెలిపారు.
బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తుందనే సంకేతాలను మాత్రం ఇచ్చాయని తెలిపారు. ఎన్డీయే ప్రభుత్వం చేసిన అభివృద్ధికి ప్రజలు పట్టం కట్టబోతున్నారని చెప్పారు.ప్రధాని అభ్యర్థిగా ఉండే అవకాశం ఉందా? అనే ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ మోదీ నాయకత్వంలో తాము ఎన్నికలకు వెళ్లామని అన్నారు.