నితిన్ ఇప్పటికే ఈ ఏడాది రెండు సినిమాలు విడుదల చేసాడు. అందులో చెక్ అభిమానులను మేపించలేకపోయిన రంగ్ దే మాత్రం పర్వాలేదు అనిపించింది. అయితే ప్రస్తుతం అతను బాలీవుడ్ లో సూపర్ హిట్గా నిలిచిన ‘అంధాధున్’ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. నితిన్ హీరోగా నటిస్తోన్న ఈ మూవీలో రాధికా ఆప్టే పోసించిన పాత్రలో నభానటేశ్ కనిపించనుండగా.. టబు రోల్ లో తమన్నా నటిస్తోంది. ఠాగూర్ మధు, నితిన్ హోం బ్యానర్ శ్రేష్ట్ మూవీస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నాయి. అయితే ఈ మధ్యే ఈ సినిమా షూటింగ్ స్టార్ అయినట్లుగా నితిన్ ట్వీట్ ద్వారా తెలియపరిచారు. నితిన్ కి ఇది 30వ సినిమా. అయితే మార్చి 30 నితిన్ పుట్టిన రోజు సందర్భంగా సరిగ్గా అర్థరాత్రి 12 గంటలకు దీనికి ‘మాస్ట్రో’ అని నామకరణం చేశారు. ఈ మేరకు ఈ చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా పేర్కొంది. కాగా.. జూన్ 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
previous post