telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

మరో సినిమాకు ఓకే చెప్పిన నితిన్…

Nithin

నితిన్ తెలుగు పరిశ్రమలో యూత్ స్టార్‌గా కొనసాగుతున్నాడు. గతప్రారంభంలో భీష్మాతో విజయం అందుకున్నాడు. దాంతో ఎక్కడా ఆగకుండా వరుస సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం నితిన్, కీర్తీ సురేష్‌లు జంటగా రంగ్ దే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా వెంకీ అల్లూరీ దర్శకత్వంలో రూపొందుతోంది. ఈ చిత్రాన్ని సితారా ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ తీస్తున్నారు.నితిన్ చేస్తున్న మరో సినిమా చెక్. ఈ సినిమాలో రకుల్ ప్రీత్‌సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్స్‌గా చేస్తున్నారు. ఈ సినిమా భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. అలాగే బాలీవుడ్‌ బ్లాక్ బస్టర్ ‘అంధాదున్’ సినిమా తెలుగు రీమేక్ కు సిద్దమయ్యాడు. నితిన్ హోమ్ బ్యానర్ శ్రేష్ఠ మూవీస్ బ్యానర్ పై సుధాకర్ రెడ్డి – నికిత రెడ్డిలు మరియు ఠాగూర్ మధు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. మేర్లపాక గాంధీ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీలో హీరోయిన్ గా ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ నటించనుందని సమాచారం. అయితే తాజాగా నితిన్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంట. గత రెండేళ్లుగా చర్చల్లో ఉన్న పవర్ పేట సినిమాకు తాజాగా నితిన్ ఓకే చెప్పారంట. ఈ సినిమాను కృష్ణ చైతన్య డైరెక్ట్ చేయనున్నారు. ఈ సినిమాను ఈ ఏడాది మేలో పట్టాలెక్కించేందుకు చూస్తున్నరని టాక్ నడుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.

Related posts