telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నితిన్ అత్తింటివారికి చిరంజీవితో అనుబంధం… !

Nithin

యంగ్ హీరో నితిన్ ఓ ఇంటివాడు కాబోతోన్న విషయం తెలిసిందే. ఈ నిజామాబాద్ పోరడు నాగర్ కర్నూల్ పోరి షాలిని రెడ్డి కందుకూరిని వివాహం చేసుకుంటున్నారు. వీరి వివాహ వేడుక ఏప్రిల్ 16న దుబాయ్‌లో కుటుంబ సభ్యుల మధ్య జరగనుంది. అనంతరం ఏప్రిల్ 21న హైదరాబాద్‌లో బంధుమిత్రులు, సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖుల కోసం రిసెప్షన్ ఏర్పాటు చేస్తున్నారు.ఇప్పటికే చకచక పెళ్లి పనులు కూడా మొదలుపెట్టేశారు. ఇక్కడ సర్‌‌ప్రైజ్ ఏంటంటే నితిన్‌ది లవ్ మ్యారేజ్.

షాలినితో తనది ఎనిమిదేళ్ల ప్రయాణం అని చెప్పారు. అంతకు మించి షాలిని రెడ్డి గురించి చిన్న విషయం కూడా బయటపెట్టలేదు. దీంతో ఎవరు ఈ షాలిని అని చాలా మందిలో ఆసక్తి పెరిగింది. షాలిని రెడ్డి కందుకూరి తెలంగాణలోని నాగర్ కర్నూల్ అమ్మాయి. ఆమె తల్లిదండ్రులు డాక్టర్లు. డాక్టర్ సంపత్ కుమార్, డాక్టర్ షేక్ నూర్జహాన్ నాగర్ కర్నూలులో గత 20 ఏళ్లుగా ప్రగతి నర్సింగ్ హోమ్‌ను నడుపుతున్నారు. వీరిది ప్రేమ వివాహం. ఇప్పుడు తమ రెండో కుమార్తె షాలినికి కూడా ప్రేమ వివాహమే చేస్తున్నారు. డాక్టర్ నూర్జహాన్‌కు చిరంజీవితో మంచి అనుబంధం ఉంది. అది రాజకీయపరంగా. 2008లో చిరంజీవి ప్రజారాజ్యం స్థాపించినప్పుడు నూర్జహాన్ పార్టీలో చేరారు. అంతేకాదు 2009 అసెంబ్లీ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ నియోజకవర్గం సీటును నూర్జహాన్‌కు ఇచ్చారు చిరంజీవి. కానీ, ఆ ఎన్నికల్లో నూర్జహాన్ ఓడిపోయారు. ఆ తరవాత ప్రజారాజ్యం పార్టీ ఏమైందో అందరికీ తెలిసిందే. నూర్జహాన్ కూడా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. మళ్లీ ఇప్పుడు నితిన్, షాలిని పెళ్లితో ఆమె వార్తల్లోకి వచ్చారు.

Related posts