కొత్త కోడలు శ్లోకా మెహతాకు, నీతా అంబానీ అద్భుతమైన కానుక ఇచ్చారు. దాని ఖరీదే ఇప్పుడు కొత్త టాపిక్. తొలుత తమ కుటుంబ వారసత్వంగా వస్తున్న బంగారు హారాన్ని శ్లోకాకు ఇవ్వాలని భావించిన నీతా, ఆపై మనసు మార్చుకుని, ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగను ఇవ్వాలని అనుకున్నారట. ఇంకేముంది? వజ్ర వైఢూర్యాలు, నవరత్నాలు పొదిగిన రూ. 300 కోట్ల విలువైన బంగారు నక్లెస్ ను ఆమెకోసం ప్రత్యేకంగా తయారు చేయించారు.
దాన్ని ధరించిన శ్లోకా మెహతాను చూసి నీతా అంబానీ మురిసిపోయారట. ఈ నెల రెండో వారంలో ముఖేష్ అంబానీ, నీతాల కుమారుడు ఆకాశ్ అంబానీకి శ్లోకా మెహతాతో వైభవంగా వివాహం జరిగిన సంగతి తెలిసిందే.