telugu navyamedia
సినిమా వార్తలు

“నిశ్శబ్దం” టీజర్ ను విడుదల చేయనున్న టాప్ డైరెక్టర్స్

Silence

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క న‌టిస్తున్న తాజా చిత్రం “సైలెన్స్‌”. తెలుగులో ఈ చిత్రం నిశ‌బ్ధం పేరుతో విడుద‌ల కానుంది. హేమంత్ మ‌ధుక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రం అమెరికాలో ఎక్కువ భాగం చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంది. తెలుగు, త‌మిళం, హిందీతో పాటు ప‌లు భాష‌ల‌లో ఈ చిత్రాన్ని విడుద‌ల చేసేందుకు మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో మాధవన్‌ హీరోగా న‌టించ‌నుండ‌గా, అంజలి, షాలినిపాండే, అవ‌స‌రాల శ్రీనివాస్, సుబ్బ‌రాజు, హాలీవుడ్‌ స్టార్‌ మైఖెల్‌ మ్యాడసన్‌ ప్రధాన పాత్రల్లో నటించనున్నారు. ఇది సస్పెన్స్, థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందనుందని సమాచారం. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, కోన ఫిలిం కార్పొరేష‌న్ సంస్థ‌తో క‌లిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. దీపావ‌ళి సంద‌ర్భంగా చిత్ర ప్రీ టీజ‌ర్ విడుద‌ల చేయ‌గా, నేడు నిశ్శ‌బ్ధం టీజ‌ర్‌ని విడుద‌ల చేయ‌నున్నారు. తెలుగులో పూరీ జ‌గ‌న్నాథ్‌, త‌మిళం, మ‌ల‌యాళంలో గౌత‌మ్ మీన‌న్, హిందీలో నీర‌జ్‌పాండే చిత్ర టీజ‌ర్‌ని సాయంత్రం 5గం.ల‌కి విడుద‌ల చేయ‌నున్నారు. టీజ‌ర్ కోసం అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

Related posts