అనుష్క ప్రధాన పాత్రలో హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించిన ప్రయోగాత్మక చిత్రం ‘నిశ్శబ్దం’. సస్పెన్స్ థ్రిల్లర్గా రూపొందిన ‘నిశ్శబ్దం’లో మాటలురాని, వినికిడి లోపం ఉన్న ఒక కళాకారిణిగా అనుష్క కనిపించనుంది. క్రితి ప్రసాద్ సమర్పణలో కోన ఫిల్మ్ కార్పోరేషన్ అసోసియేషన్తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వప్రసాద్, కోన వెంకట్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో మాధవన్, అంజలి, షాలిని పాండే, సుబ్బరాజు, శ్రీనివాస్ అవసరాల కీలక పాత్రలు పోషించారు. హాలీవుడ్ నటుడు మైఖేల్ మాడ్సన్ ఈ చిత్రం ద్వారా భారతీయ సినిమా అరంగేట్రం చేస్తున్నారు. ఈ సినిమాను ఏప్రిల్ 2న విడుదల చేయాలని మొదట భావించారు. కానీ కరోనా మహమ్మారి కారణంగా ఆగిపోయింది. దీంతో ప్రముఖ ఓటిటి సంస్థ అమెజాన్ ప్రైమ్ లో అక్టోబర్ 2న ఈ సినిమా వరల్డ్ ప్రీమియర్ ప్రసారం కానున్నట్టు అమెజాన్ వెల్లడించింది. ఇక సినిమా ప్రమోషన్ లో భాగంగా తాజాగా చిత్ర యూనిట్ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ని యంగ్ హీరో రానా చేత రిలీజ్ చేయించింది.. ఉత్కంఠ భరితంగా ఉన్న ట్రైలర్ ఆకట్టుకుంటుంది. సోనాలి అనే యువతి కనిపించకుండా పోవటానికి కారణం ఏంటి ? సాక్షి (అనుష్క), ఆంటోని (మాధవన్)లు ఎవరు? వారికి సోనాలికీ సంబంధం ఏంటి? ఇలాంటి ఆసక్తికర విషయాలన్నీ తెలియాలంటే సినిమాను వీక్షించాల్సిందే.
previous post
next post