telugu navyamedia
రాజకీయ వార్తలు

ఎర్రటి సంచిలో బడ్జెట్ పత్రాలు.. క్లారిటీ ఇచ్చిన నిర్మలా సీతారామన్!

nirmalasitharaman bag budget

ఆంగ్లేయుల పాలన కాలం నుంచి గత ఏడాది కేంద్ర బడ్జెట్ వరకు బడ్జెట్ పత్రాలను లెదర్ బ్రీఫ్ కేసులో తీసుకురావడం జరిగింది. ఈ సాంప్రదాయాన్ని పక్కనపెట్టి ఈరోజు ఎర్రటి సంచిలో బడ్జెట్ పత్రాలను పార్లమెంటుకు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తీసుకొచ్చారు. ఆ సంచిపై భారత అధికార చిహ్నమైన మూడు సింహాలు ఉన్నాయి.

ఎర్రటి సంచిలో బడ్జెట్ పత్రాలపై నిర్మలా సీతారామన్ ఎర్ర సంచి పై క్లారిటీ ఇచ్చారు. బ్రిటీష్ హ్యాంగోవర్ నుంచి బయటకు రావడానికి ఇదే సరైన సమయమని నిర్మల తెలిపారు. అంతేకాదు మోసుకురావడానికి కూడా సులభంగా ఉంటుందని అభివర్ణించారు. బడ్జెట్ పత్రాలను తీసుకురావడానికి లెదర్ సూట్ కేసునే నేను ఎందుకు వాడాలని ఆమె ప్రశ్నించారు. మన సాంప్రదాయాల వైపు కదులుదామని వ్యాఖ్యానించారు.

Related posts