ఆరు మానవ మృగాళ్లు ఢిల్లీలో నిర్భయపై దాడి చేసి అత్యాచారానికి పాల్పడ్డారు. 2012, డిసెంబర్ 16న జరిగిన ఈ ఘటన అప్పట్లో దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ దారుణ ఘటనలో తీవ్రంగా గాయపడిన నిర్భయ మృతి చెందింది. ఈ కేసులో నలుగురు దోషులను డిసెంబర్ 16న ఉరి తీయనున్నారు.
ఈ నెల 16న ఉదయం 5 గంటలకు నలుగురు దోషులకు ఈ శిక్ష అమలు చేస్తున్నట్లు తిహార్ జైలు అధికారులు చెప్పారు. తమకు ఈ రోజు కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ మేరకు ఆదేశాలు అందినట్లు తెలిపారు. ప్రస్తుతం దోషులు తిహార్ జైలులోనే ఉన్న విషయం తెలిసిందే. వారిని ఉరి తీసేందుకు జైలు అధికారులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ కేసులో మొత్తం ఆరుగురు దోషులుగా తేలిన విషయం తెలిసిందే. వీరిలో ఒకరు జూవైనల్ కోర్టు విధించిన శిక్ష అనుభవించాడు. మరో దోషి రామ్సింగ్ జైలులోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు