telugu navyamedia
క్రైమ్ వార్తలు రాజకీయ వార్తలు

ఉరిశిక్ష అమలు చేయాలని నిర్భయ తల్లి పిటిషన్!

nirbhaya-mother police

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘నిర్భయ’ హత్యాచారం కేసులో దోషులకు ఉరి శిక్ష అమలుపై జరుగుతోన్న జాప్యంపై ఆమె తల్లి స్పందించారు. డిసెంబరు 18న దోషులపై డెత్ వారెంట్ జారీ అవుతుంది’ అని అన్నారు. ఈ క్రమంలో నిర్భయ దోషులకు వెంటనే ఉరిశిక్ష అమలు చేయాలని ఢిల్లీ పటియాలా హౌస్ కోర్టులో నిర్భయ తల్లిదండ్రులు పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై విచారణను ఈ నెల 18కి ఢిల్లీ పటియాలా హౌస్ కోర్టు వాయిదా వేసింది.

నిర్భయ కేసులో దోషి అక్షయ్ సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయడం, దానిపై ఇంప్లీడ్ అయ్యేందుకు అనుమతి కోరుతూ నిర్భయ తల్లి పిటిషన్ వేయడంతో.. సుప్రీంకోర్టు ఈ పిటిషన్ లను ఈ నెల 17న విచారించనున్న విషయం తెలిసిందే. ఈ నెల 17న సుప్రీంకోర్టులో విచారణ ఉన్న నేపథ్యంలోనే ‘నిర్భయ’ హత్యాచారం కేసులో నలుగురు దోషులకు ఉరి శిక్ష వెంటనే అమలు చేయాలంటూ వచ్చిన పిటిషన్ పై విచారణను ఢిల్లీ పటియాలా హౌస్ కోర్టు ఈ నెల 18కి వాయిదా వేసింది.

Related posts