telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు సామాజిక

నిర్భయ దోషులకు జైలు అధికారుల లేఖ

nirbaya accuseds

నిర్భయ దోషులకు మార్చి 3న ఉదయం 6 గంటలకు ఉరిశిక్ష ఖరారైన సంగతి తెలిసిందే. ఈ మేరకు ట్రయల్ కోర్టు డెత్ వారెంట్ ను జారీ చేసింది. ఈ నేపథ్యంలో నిర్భయ దోషులకు తీహార్ జైలు అధికారులు చివరి లేఖను రాశారు. కుటుంబ సభ్యులను కలుసుకునేందుకు అనుమతిస్తామంటూ లేఖలో అధికారులు పేర్కొన్నారు.

అయితే, దోషుల్లో ఇద్దరైన అక్షయ్, వినయ్ మాత్రమే తమ కుటుంబ సభ్యులను కలుస్తామని అధికారులకు చెప్పారట. ముఖేశ్, పవన్ మాత్రం ఫిబ్రవరి 1వ తేదీకి ముందే తాము కుటుంబ సభ్యులను కలిశామని జైలు అధికారులకు తెలిపారు. మరోవైపు, వినయ్ తన తలను జైల్లోని గోడకు కొట్టుకోవడంతో జైలు అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు.

Related posts