ఆర్థిక నేరగాడు, వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ ఆచూకీ ఎట్టకేలకు లభ్యమైంది. 16 నెలల తర్వాత మోడీ ఆచూకీ దొరికింది. భారత బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు రుణాలు ఎగ్గొట్టి తప్పించుకుని తిరుగుతున్న ఆయన లండన్లో స్వేచ్చగా తిరుగుతున్నాడు.
టెలిగ్రాఫ్ పత్రిక పేపర్కు నీరవ్ మోడీ దృశ్యాలు చిక్కాయి. 2018 జులైలో నీరవ్ మోడీపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారు. నీరవ్ మోడీ భారత బ్యాంకులకు రూ.13వేల 700 కోట్ల రూపాయల మేర మోసానికి పాల్పడ్డాడు. తాజాగా, భారత్ లోని ఆయన అక్రమ కట్టడాలను ప్రభుత్వం కూల్చేసిన విషయం తెలిసిందే.