telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ రాజకీయ

నీరవ్ మోడీ .. కార్ల వేలం .. మీరు పాడుకోవచ్చు.. !

nirav modi cars auction on 18th

ఆర్థిక నేరస్తుడిగా ఆరోపణలు ఎదుర్కొంటు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కాంలో ప్రధాన నిందితుడైన నీరవ్ మోడీకి చెందిన 13 కార్లను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వేలం వేయనుంది. ఏప్రిల్ 18న వీటి వేలం జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే అతనికి సంబంధించిన పెయింటింగ్స్‌ను వేలం వేసి ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ రూ.54.84 కోట్లు రికవరీ చేసింది. ఇప్పుడు అతనికి సంబంధించిన లగ్జరీ కార్లు రోల్స్ రాయ్స్ ఘోస్ట్, పోర్షె పనమెరా, రెండు మెర్సెడీజ్ బెంజ్, మూడు హోండా కార్లు, టొయొటా ఫార్చునర్, ఇన్నోవాలాంటి వాటిని వేలం వేయనున్నారు.

నీరవ్ మోడీపై మనీ లాండరింగ్ కేసు పెట్టిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్.. ఈ కార్లను స్వాధీనం చేసుకుంది. ఈ కార్లన్నీ మంచి కండిషన్‌లో ఉండటంతో వీటి ద్వారా మరికొన్ని కోట్లు రాబట్టుకోవాలని ఈడీ చూస్తున్నది. ప్రభుత్వ రంగ సంస్థ అయిన మెటల్ స్క్రాప్ ట్రేడ్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు ఈ వేలం కాంట్రాక్ట్ అప్పగించారు. అటు లండన్ జైల్లో ఉన్న నీరవ్ మోడీకి.. అక్కడి వెస్ట్‌మినిస్టర్ కోర్టు బెయిల్ నిరాకరించిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 26న తదుపరి విచారణ జరిగే వరకు నీరవ్ మోడీ వాండ్స్‌వర్త్ జైల్లోనే ఉండనున్నాడు.

Related posts