తెలంగాణ వ్యవసాయ శాఖా మంత్రి నిరంజన్ రెడ్డి తృటిలో పెను ప్రమాదం తప్పింది. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ప్రయాణిస్తున్న కాన్వాయ్ లోని రెండు వాహనాలు ఒకదాన్ని ఒకటి ఢీకొన్నాయి. వనపర్తి నుంచి కొత్తకోటకు బయలుదేరిన సమయంలో ఈ ఘటన జరిగింది.
ఓ బర్రె రహదారిపై అడ్డుగా రావడంతో డ్రైవర్ సడన్ బ్రేక్ వేయగా అదుపుతప్పిన ఆ వాహనం, మరో వాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో మంత్రి ప్రయాణిస్తున్న వాహనం, దాని వెనుకే వస్తున్న ఎస్కార్ట్ వాహనం ఢీకొనగా, రెండు వాహనాలూ దెబ్బతిన్నాయి. ఈ ప్రామాదంలో ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు వెల్లడించారు.
బీజేపీలో చేరనందుకే శివకుమార్ పై వేధింపులు: సిద్ధరామయ్య