telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

మున్సిపల్ ఎన్నికల్లో డబ్బుల పంపిణీ…. నిమ్మగడ్డ సీరియస్

ఏపీలోని అన్ని రాజకీయ పార్టీలు లోకల్‌ ఎలక్షన్స్‌పై దృష్టి పెట్టాయి. ఇప్పటికే గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగియగా.. అటు మున్సిపల్‌ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు తమ గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి. ఓటర్లను ఎలాగైనా తమ వైపు తిప్పుకోవాలని పార్టీలు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. దీనికోసం డబ్బు పంపిణీ చేస్తున్నాయి పార్టీలు. దీంతో మున్సిపల్ ఎన్నికల్లో డబ్బుల పంపిణీపై ఎస్ఈసీ నిమ్మగడ్డ సీరియస్ అయ్యారు. ఎన్నికల్లో డబ్బులు విపరీతంగా పంపిణీ చేస్తున్న వారి వివరాలను ఐటీకి అందిస్తున్నట్టు వెల్లడించారు. డబ్బుల పంపిణీ.. ఎన్నికల ఖర్చుపై ప్రత్యేక నిఘా పెట్టినట్టు ఎస్ఈసీ స్పష్టం చేశారు. విజయవాడ, గుంటూరు విశాఖ, తిరుపతి వంటి నగరాల్లో డబ్బుల పంపిణీ విపరీతంగా జరుగుతోన్నట్టు తమకు ఫిర్యాదులు అందాయన్నారు ఎస్ఈసీ నిమ్మగడ్డ. ఎన్నికల నిఘా బృందాలు డబ్బు, మద్యం పంపిణీపై ఎస్ఈసీ స్పెషల్ ఫోకస్ పెట్టారు.

Related posts