మ్యాట్రిక్స్ అధినేతనిమ్మగడ్డ ప్రసాద్ సెర్బియా దేశానికి విహారయాత్ర నిమిత్తం వెళ్లారు. వాన్ పిక్ వ్యవహారంలో రస్ అల్ ఖైమా సంస్థ ఇచ్చిన ఫిర్యాదుతో సెర్బియా పోలీసులు నిమ్మగడ్డను అరెస్ట్ చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన తరఫు న్యాయవాది సీబీఐ కోర్టులో మెమో దాఖలు చేశారు. కేసు విచారణ సందర్భంగా సెర్బియా పోలీసుల నిర్బంధంలో ఉన్న కారణంగా తన క్లయింటు నిమ్మగడ్డ స్వదేశానికి రాలేకపోతున్నారని న్యాయవాది కోర్టుకు విన్నవించారు. నిమ్మగడ్డ తరఫు న్యాయవాది ఇదే విషయాన్ని సీబీఐ అధికారులకు కూడా తెలియజేశారు.