telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

మున్సిపల్ ఎన్నికల పై నిమ్మగడ్డ…

Nimmagadda ramesh

ఏపీలో పంచాయతీ ఎన్నికలు ముగిసిన కొన్ని రోజులకే మున్సిపల్ ఎన్నికలు వచ్చాయి. అయితే ఈ ఎలక్షన్స్ నిన్న ముగిసాయి. అయితే ఈ ఎన్నికల పై ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికలు సజావుగా ముగిసినట్టు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పేర్కొన్నారు.  ఎన్నికలు ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.  రాష్ట్రంలో 12 కార్పొరేషన్లు, 71 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగినట్టు తెలిపారు.  చెదురుమొదురు ఘటనలు మినహా ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోలేదని అన్నారు.  రాష్ట్రంలో రీపోలింగ్ అవసరం లేకుండా ఎన్నికలను నిర్వహించడం ఇదే మొదటిసారి అని, అందుకు సహకరించిన అందరికి ఎస్ఈసి నిమ్మగడ్డ ధన్యవాదాలు తెలిపారు.  కార్పొరేషన్లలో 54.71 శాతం, మున్సిపాలిటీల్లో 70.65 శాతం పోలింగ్ జరిగినట్టు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ పేర్కొన్నారు.  ఈనెల 14 వ తేదీన ఓట్ల లెక్కింపు ఫలితాలు ఉంటాయని అన్నారు. అయితే చూడాలి మరి ఈ ఫలితాల రోజు ఎటువంటి సంభరణాలు జరుగుతాయి… విజయం ఎవరు సాధిస్తారు అనేది.

Related posts