యంగ్ హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన మిస్టరీ థ్రిల్లర్ చిత్రం కార్తికేయ 2. చందు మొండేటి దర్శకత్వంలో కార్తికేయకు సీక్వెల్గా వస్తోంది చిత్రం. ఈ చిత్రం లో నిఖిల్ సరసన హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ నటిస్తుంది.
ఇప్పటికే ఈ చిత్రం కి సంబంధించిన పోస్టర్స్, వీడియో లు సినిమా పై ఆసక్తి ను పెంచేశాయి.ఈ చిత్రం ను జూలై 22, 2022 న ప్రపంచ వ్యాప్తంగా భారీగా థియేటర్ల లో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.
సముద్రం దాచుకున్న ద్వారకా నగరం.. దాని వెనకున్న రహస్యాన్ని కనిపెట్టే కథాంశంతో ఈ సినిమా రూపొందుతున్నట్టు ఇప్పటికే విడుదలైన మోషన్ పోస్టర్తో అర్థమైంది.
తాజాగా ఈ చిత్రం కి సంబంధించిన ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేశారు.ట్రైలర్ విషయానికొస్తే… శాంతను.. ‘ఇది నువ్వు ఆపలేని యాగం.. నేను ఓ సమిధను మాత్రమే, ఆజ్యం అక్కడ మళ్లీ మొదలైంది’ ..ప్రాణత్యాగం చేసే తెగింపు ఉంటేనే దానినిపొందగలవు..అంటూ హీరోకు ఎలివేషన్ ఇచ్చారు.
‘అసలు కృష్ణుడు ఏంటి? ఈ కథను ఆయనే నడిపించటం ఏంటి?’ అంటూ నిఖిల్.. ‘విశ్వం ఒక పూసల దండ. ప్రతిదీ నీకు సంబంధమే. ప్రతిదీ నీ మీద ప్రభావమే’ అంటూ అనుపమ్ ఖేర్ చెబుతున్న డైలాగ్స్ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి.
సూపర్ విజువల్స్ తో, అద్దిరిపోయే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో, డైలాగ్ లతో ట్రైలర్ ఆకట్టుకుంటుంది. నిఖిల్ సిద్ధార్థ్ మరో మిస్టరీ ను చేదించెందుకు రెడీ అయినట్లు ట్రైలర్ ను చూస్తే అర్ధం అవుతుంది.
ఈ సినిమాలో అతి ముఖ్యమైన ధన్వంతరి పాత్రలో ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ నటిస్తుండగా.. శాంతనుగా ఆదిత్య మీనన్.. సదానందగా శ్రీనివాస్ రెడ్డి.. సులేమాన్గా వైవా హర్ష కనిపించనున్నారు.
అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకం పై అభిషేక్ అగర్వాల్ మరియు టీజీ విశ్వ ప్రసాద్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
దర్శకనిర్మాతలు రూమ్ లో పెట్టి తాళం వేసేవారు… హాట్ బ్యూటీ కామెంట్స్